దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త AI కారిడార్..!!
- August 18, 2025
యూఏఈః దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు AI-ఆధారిత కారిడార్కు నిలయంగా ఉంది. ఇది ప్రయాణికులు సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.కొత్త AI కారిడార్ ద్వారా ఒకేసారి 10 మంది గుర్తింపు పత్రాలను స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ ఏఐ వ్యవస్థలు క్రాసింగ్ల వద్దకు రాకముందే ప్రయాణీకుల డేటాను గుర్తిస్తాయని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
కొత్త AI-ఆధారిత కారిడార్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు. ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని అన్నారు. ఏదైనా అనుమానాస్పద పాస్పోర్ట్ను గుర్తించడంలో కొత్త ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని అల్ మర్రి చెప్పారు. కాగా, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నివేదిక ప్రకారం, 2024 లో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పరంగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







