దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త AI కారిడార్..!!
- August 18, 2025
యూఏఈః దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు AI-ఆధారిత కారిడార్కు నిలయంగా ఉంది. ఇది ప్రయాణికులు సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.కొత్త AI కారిడార్ ద్వారా ఒకేసారి 10 మంది గుర్తింపు పత్రాలను స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ ఏఐ వ్యవస్థలు క్రాసింగ్ల వద్దకు రాకముందే ప్రయాణీకుల డేటాను గుర్తిస్తాయని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
కొత్త AI-ఆధారిత కారిడార్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు. ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని అన్నారు. ఏదైనా అనుమానాస్పద పాస్పోర్ట్ను గుర్తించడంలో కొత్త ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని అల్ మర్రి చెప్పారు. కాగా, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నివేదిక ప్రకారం, 2024 లో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పరంగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









