దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త AI కారిడార్..!!
- August 18, 2025
యూఏఈః దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు AI-ఆధారిత కారిడార్కు నిలయంగా ఉంది. ఇది ప్రయాణికులు సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.కొత్త AI కారిడార్ ద్వారా ఒకేసారి 10 మంది గుర్తింపు పత్రాలను స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ ఏఐ వ్యవస్థలు క్రాసింగ్ల వద్దకు రాకముందే ప్రయాణీకుల డేటాను గుర్తిస్తాయని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
కొత్త AI-ఆధారిత కారిడార్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు. ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని అన్నారు. ఏదైనా అనుమానాస్పద పాస్పోర్ట్ను గుర్తించడంలో కొత్త ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని అల్ మర్రి చెప్పారు. కాగా, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నివేదిక ప్రకారం, 2024 లో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పరంగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









