రెస్టారెంట్లోకి దూసుకెళ్ళిన ట్రక్: ఇద్దరు మృతి
- July 17, 2016
మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్లోకి పికప్ ట్రక్ దూసుకుపోవంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన అజ్మన్లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి, అజ్మన్లోని ఓ పెట్రోల్ స్టేషన్లో ఉన్న మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్లోకి అదుపు తప్పిన పికప్ ట్రక్ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని షేక్ ఖలీఫా హాస్పిటల్కి తరలించామని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో ఇండియాకి చెందిన రెండు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని ప్రచారం చేస్తే అది నేరపూరిత చర్యగా భావించబడుతుందని అజ్మన్ పోలీస్ డిప్యూటీ చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హమ్రాని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







