తల్లి వేధింపులు: బాలికకు దుబాయ్ పోలీసుల అండ
- July 17, 2016
తల్లి వేధింపుల నుండి 12 ఏళ్ళ బాలికకు దుబాయ్ పోలీసులు విముక్తి కల్పించారు. ఆ బాలిక నుంచి ఫోన్ కాల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు క్యుసైస్ పోలీసు - విక్టిమ్ కేర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. క్యుసైప్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ తని బిన్ ఘలితా మాట్లాడుతూ, తమ డిపార్ట్మెంట్ పిల్లల్ని వేధిస్తున్న నాలుగు కేసుల్ని టాకిల్ చేసినట్లుగా వెల్లడించారు. ఇందులో జాహిర్ కేసు కూడా ఒకటి. బాధితురాల్ని విక్టిమ్ కేర్ ఎంప్లాయీ, దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్కి తరలించారు. బాధితురాలి తల్లి పలు కేసుల్లో వాంటెడ్గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు, తనను డ్రైవర్ లైంగికంగా వేధించినట్లు తొలుత పేర్కొంది. అయితే ఆ తర్వాత ఆమే స్వయంగా ఆ ఆరోపణల్ని ఖండించింది. బాధితురాలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







