85 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు సీజ్..ఇద్దరు అరెస్టు
- August 23, 2025
మస్కట్: అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్చితమైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ ఆపరేషన్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ ను ఛేదించినట్టు తెలిపింది.
అనుమానితుల వద్ద 85 కిలోగ్రాములకు పైగా హషీష్, గంజాయి, అలాగే 70,000 సైకోట్రోపిక్ మాత్రలను సీజ్ చేసినట్టు వెల్లడించింది. మాదకద్రవ్యాలను ఖురియాత్ తీరం వెంబడి ఒక ప్రదేశంలో దాచిపెట్టి, వాహనంలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









