85 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు సీజ్..ఇద్దరు అరెస్టు
- August 23, 2025
మస్కట్: అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్చితమైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ ఆపరేషన్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ ను ఛేదించినట్టు తెలిపింది.
అనుమానితుల వద్ద 85 కిలోగ్రాములకు పైగా హషీష్, గంజాయి, అలాగే 70,000 సైకోట్రోపిక్ మాత్రలను సీజ్ చేసినట్టు వెల్లడించింది. మాదకద్రవ్యాలను ఖురియాత్ తీరం వెంబడి ఒక ప్రదేశంలో దాచిపెట్టి, వాహనంలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







