విజేతలకు సర్టిఫికేట్స్ అందించిన ఒమన్‌లో భారత రాయబారి..!!

- August 25, 2025 , by Maagulf
విజేతలకు సర్టిఫికేట్స్ అందించిన ఒమన్‌లో భారత రాయబారి..!!

మస్కట్: భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళా పోటీలో విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్లను అందించడానికి ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి జివి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

షా నాగర్‌దాస్, ఖిమ్జీ రాందాస్ గ్రూప్ మరియు లులు ఎక్స్ఛేంజ్ మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో 4-8 సంవత్సరాలు, 9-11 సంవత్సరాలు మరియు 12-14 సంవత్సరాల వయస్సు విభాగాలలో పోటీలు నిర్వహించారు. భారతదేశం పట్ల తమ ప్రేమను కళ ద్వారా ప్రదర్శించారు.  డెలీషియస్ డ్యాన్స్ అకాడమీ మరియు కింగ్స్ యునైటెడ్ మస్కట్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు.   ఈ పోటీలు,  సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం ఒమన్ - భారతదేశం మధ్య కళ, సంస్కృతి మరియు సమాజంలో విలువలను పెంపొదిస్తుందని, సహకార స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని వక్తలు అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com