మిషన్ కాకతీయ పనులను చూసేందుకు తెలంగాణకు వస్తా: ఉమా భారతి
- July 18, 2016
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను గురించి వివరించారు. వీటిని పరిశీలించేందుకు రాష్ర్టానికి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటిపారుదల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మిషన్ కాకతీయ పనులను చూసేందుకు త్వరలో తాను తెలంగాణకు రానున్నట్టు వెల్లడించారు.మిషన్ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికే ఆదర్శమని అన్నారు. తమ శాఖకు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్ను కోరానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు మిగతా రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కేంద్ర టాస్క్ఫోర్స్లో పెట్టామని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







