దుబాయ్లో 'ప్రవాసీ' సంఘాలపై కఠిన చర్యలు
- July 18, 2016
గల్ఫ్ దేశాలలో ఇటీవల పుట్టుకొస్తున్న అనేక ‘ప్రవాసీ సంఘాల’ కార్యకలాపాలపై గల్ఫ్దేశాల అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. జన సమీకరణ, సంఘాల సమావేశాలు, ప్రసంగాలపై ప్రభుత్వ డేగకన్ను సారించింది. ప్రవాసుల సంస్కృతి, సంక్షేమం అంటూ పుట్టుకొస్తున్న సంఘాలు ప్రాథమిక చట్టాలను ఉల్లంఘిస్తున్నందున అధికారులు దృష్టి సారించారు. దుబాయిలో మౌనంగా ఉంటూ తెలుగు రాష్ట్రాలలో సంఘాలంటూ సోషల్ మీడియా, పత్రికలలో దర్శనమిచ్చేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా తగ్గడానికి అధికారుల కట్టుబాట్లు కారణమని విశ్వసనీయ సమాచారం. భారత్ ఎంబసీల ఆవరణలోనైనా ఏదైనా సంఘం సమావేశం నిర్వహించాలంటే 40రోజుల ముందు అనుమతి పొందడంతోపాటు కార్యకలాపాల పూర్తి వివరాలు అందజేయాలని గల్ఫ్ అధికారులు సూచిస్తున్నారు. సంఘ కార్యవర్గ సభ్యుల రెసిడెన్సీ వీసా, భారత పాస్పోర్టు వివరాలను విధిగా సమర్పించాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడయినా వీరు నోరు జారితే ఆ వివరాల ఆధారంగా అరెస్టుకు అవకాశం ఉంటుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉదార, సరళీకృత నిబంధనలున్న దుబాయ్లో దీన్ని పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని సీడీఏ ఆధ్వర్యంలో దుబాయ్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయ సంఘాలన్నీ విధిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోకుండా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరిస్తున్నారు. దుబాయిలో సంఘం నాయకులుగా తెలుగు రాష్ట్రాలలో చలామణి అవుతున్న కొందర్ని పిలిపించి హెచ్చరించారు. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్నవారి వివరాలు సేకరించడమే కాకుండా తెలుగుసహా ఇతర భారతీయ భాషల నుంచి అరబ్బీ భాషలోకి వీరి ప్రకటనలు, ఇతర సమాచారాన్ని అనువదిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







