దుబాయ్‌లో 'ప్రవాసీ' సంఘాలపై కఠిన చర్యలు

- July 18, 2016 , by Maagulf
దుబాయ్‌లో 'ప్రవాసీ' సంఘాలపై కఠిన చర్యలు

గల్ఫ్‌ దేశాలలో ఇటీవల పుట్టుకొస్తున్న అనేక ‘ప్రవాసీ సంఘాల’ కార్యకలాపాలపై గల్ఫ్‌దేశాల అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. జన సమీకరణ, సంఘాల సమావేశాలు, ప్రసంగాలపై ప్రభుత్వ డేగకన్ను సారించింది. ప్రవాసుల సంస్కృతి, సంక్షేమం అంటూ పుట్టుకొస్తున్న సంఘాలు ప్రాథమిక చట్టాలను ఉల్లంఘిస్తున్నందున అధికారులు దృష్టి సారించారు. దుబాయిలో మౌనంగా ఉంటూ తెలుగు రాష్ట్రాలలో సంఘాలంటూ సోషల్‌ మీడియా, పత్రికలలో దర్శనమిచ్చేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా తగ్గడానికి అధికారుల కట్టుబాట్లు కారణమని విశ్వసనీయ సమాచారం. భారత్ ఎంబసీల ఆవరణలోనైనా ఏదైనా సంఘం సమావేశం నిర్వహించాలంటే 40రోజుల ముందు అనుమతి పొందడంతోపాటు కార్యకలాపాల పూర్తి వివరాలు అందజేయాలని గల్ఫ్‌ అధికారులు సూచిస్తున్నారు. సంఘ కార్యవర్గ సభ్యుల రెసిడెన్సీ వీసా, భారత పాస్‌పోర్టు వివరాలను విధిగా సమర్పించాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడయినా వీరు నోరు జారితే ఆ వివరాల ఆధారంగా అరెస్టుకు అవకాశం ఉంటుంది. మొత్తం గల్ఫ్‌ ప్రాంతంలో ఉదార, సరళీకృత నిబంధనలున్న దుబాయ్‌లో దీన్ని పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. దుబాయ్‌ ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని సీడీఏ ఆధ్వర్యంలో దుబాయ్‌లో పనిచేస్తున్న ప్రవాస భారతీయ సంఘాలన్నీ విధిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోకుండా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరిస్తున్నారు. దుబాయిలో సంఘం నాయకులుగా తెలుగు రాష్ట్రాలలో చలామణి అవుతున్న కొందర్ని పిలిపించి హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో క్రియాశీలంగా ఉన్నవారి వివరాలు సేకరించడమే కాకుండా తెలుగుసహా ఇతర భారతీయ భాషల నుంచి అరబ్బీ భాషలోకి వీరి ప్రకటనలు, ఇతర సమాచారాన్ని అనువదిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com