బలవంతపు శ్రమ దోపిడీ, మానసిక వేధింపులు.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- August 28, 2025
మనామా: మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1,000 బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అలాగే, మహిళా నిందితురాలిని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించినదని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదును అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు. బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో, జీతం లేకుండా, బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమ దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసి, నిందితులను విచారించారు. ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









