బలవంతపు శ్రమ దోపిడీ, మానసిక వేధింపులు.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- August 28, 2025
మనామా: మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1,000 బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అలాగే, మహిళా నిందితురాలిని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించినదని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదును అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు. బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో, జీతం లేకుండా, బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమ దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసి, నిందితులను విచారించారు. ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







