బలవంతపు శ్రమ దోపిడీ, మానసిక వేధింపులు.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- August 28, 2025
మనామా: మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1,000 బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అలాగే, మహిళా నిందితురాలిని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించినదని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదును అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు. బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో, జీతం లేకుండా, బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమ దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసి, నిందితులను విచారించారు. ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







