బలవంతపు శ్రమ దోపిడీ, మానసిక వేధింపులు.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- August 28, 2025
మనామా: మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1,000 బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అలాగే, మహిళా నిందితురాలిని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించినదని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదును అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు. బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో, జీతం లేకుండా, బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమ దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసి, నిందితులను విచారించారు. ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







