తెలంగాణ: రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్..
- September 07, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ తయారీ యూనిట్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ డ్రగ్స్ దందా వెనుక విజయ్ ఓలేటి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అతను కిలో రూ.50 లక్షల చొప్పున డ్రగ్స్ ను హైదరాబాద్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ వ్యాపారం కోసం అతను ఒక ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించారని అధికారులు తెలిపారు.
ఈ డ్రగ్స్ యూనిట్ ను పట్టుకోవడంలో పోలీసుల వ్యూహాత్మక దర్యాప్తు కీలక పాత్ర పోషించింది. ముంబై నార్కోటిక్ పోలీసులలో ఒకరు సాధారణ కార్మికుడిలా ఆ డ్రగ్స్ యూనిట్లో చేరారు. అలా చేరిన అధికారి పక్కాగా వివరాలు సేకరించి, ఆ యూనిట్ గుట్టును రట్టు చేయడంలో సాయపడ్డారు. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ తయారీ యూనిట్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ యూనిట్ బయటపడటంతో రాష్ట్రంలో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల వ్యాపారంపై నిఘా పెంచి, పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







