నేపాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు..
- September 09, 2025
నేపాల్ లో హింస రాజ్యమేలుతోంది. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు మంత్రులను టార్గెట్ చేశారు. వీధుల్లో ఉరికించి ఉరికించి మరీ కొడుతున్నారు. మంత్రులపై దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ (65) ని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.నిరసనకారులు మంత్రిని వీధుల్లో పరిగెత్తించారు. ఆయనపై దాడి చేశారు. ఓ వ్యక్తి కాలితో ఎగిరితన్నాడు. నిరసనకారుల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు మంత్రి ప్రసాద్ పరుగులు పెట్టారు. ఈ ఆందోళనకర దృశ్యాలు కలవరపెడుతున్నాయి. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు. వారిపైనా దాడి చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







