నేపాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు..
- September 09, 2025
నేపాల్ లో హింస రాజ్యమేలుతోంది. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు మంత్రులను టార్గెట్ చేశారు. వీధుల్లో ఉరికించి ఉరికించి మరీ కొడుతున్నారు. మంత్రులపై దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ (65) ని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.నిరసనకారులు మంత్రిని వీధుల్లో పరిగెత్తించారు. ఆయనపై దాడి చేశారు. ఓ వ్యక్తి కాలితో ఎగిరితన్నాడు. నిరసనకారుల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు మంత్రి ప్రసాద్ పరుగులు పెట్టారు. ఈ ఆందోళనకర దృశ్యాలు కలవరపెడుతున్నాయి. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు. వారిపైనా దాడి చేశారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







