ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- September 13, 2025
విజయవాడ: బెజవాడ దుర్గమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈఓ వి.కె.శీనా నాయక్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫిర్యాదులు ఉంటే కలెక్టర్, ఈఓ, దేవదాయ శాఖ కమిషనర్లకు తెలియజేయవచ్చని సూచించారు.
భక్తులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు
ఆలయ వేదపాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైరల్ వ్యాధుల పై అవగాహన కల్పించి, అవసరమైన వారికి చికిత్స అందించారు. దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందించే నిత్యాన్నదానం నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు అన్నప్రసాదం పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?
-దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభమవుతాయి.
అన్నదానం పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు?
-కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు స్వయంగా అన్నప్రసాదం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









