ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- September 13, 2025
విజయవాడ: బెజవాడ దుర్గమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈఓ వి.కె.శీనా నాయక్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫిర్యాదులు ఉంటే కలెక్టర్, ఈఓ, దేవదాయ శాఖ కమిషనర్లకు తెలియజేయవచ్చని సూచించారు.
భక్తులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు
ఆలయ వేదపాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైరల్ వ్యాధుల పై అవగాహన కల్పించి, అవసరమైన వారికి చికిత్స అందించారు. దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందించే నిత్యాన్నదానం నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు అన్నప్రసాదం పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?
-దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభమవుతాయి.
అన్నదానం పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు?
-కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు స్వయంగా అన్నప్రసాదం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









