ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- September 13, 2025
విజయవాడ: బెజవాడ దుర్గమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈఓ వి.కె.శీనా నాయక్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫిర్యాదులు ఉంటే కలెక్టర్, ఈఓ, దేవదాయ శాఖ కమిషనర్లకు తెలియజేయవచ్చని సూచించారు.
భక్తులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు
ఆలయ వేదపాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైరల్ వ్యాధుల పై అవగాహన కల్పించి, అవసరమైన వారికి చికిత్స అందించారు. దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందించే నిత్యాన్నదానం నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు అన్నప్రసాదం పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?
-దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభమవుతాయి.
అన్నదానం పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు?
-కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు స్వయంగా అన్నప్రసాదం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!