మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- September 13, 2025
మహిళల హకీ ఆసియా కప్లో భారత జట్టు మరోసారి తన శక్తిని చాటుకుంది. సూరజ్ లతా దేవీ నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం జరిగిన కీలక సూపర్ 4 మ్యాచ్లో జపాన్తో 1-1తో డ్రా చేసి ఫైనల్ బెర్తు దక్కించుకుంది.ఇక మరో మ్యాచ్లో చైనా కొరియా పై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్కి ఎదురుగా నిలవనుంది. చైనా ఈ విజయంతో పట్టికలో టాప్లో నిలిచింది. భారత్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. దీంతో ఇరుజట్లు ఆదివారం ట్రోఫీ కోసం తలపడనున్నాయి.ఫైనల్లో గెలుపొందిన జట్టు వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది. అందుకే భారత్-చైనా పోరు ఆసక్తిని రేపుతోంది.
భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఆట మొదలైన 7వ నిమిషంలోనే నేహా గోయల్ గోల్ ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి ప్లేయర్ డుంగ్ డుంగ్ బంతిని ఆపినా, అది గోల్లైన్ దాటి లోపలికి వెళ్లడంతో రిఫరీ భారత్కు గోల్ ప్రకటించాడు. ఈ గోల్తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.రెండో అర్ధభాగంలో జపాన్ దాడులను పెంచింది.పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాలని ప్రయత్నించింది. కానీ భారత గోల్కీపర్ అద్భుత రక్షణతో వాటిని అడ్డుకున్నాడు. దీంతో భారత్ ఆధిక్యం కొనసాగింది.మూడో అర్ధ భాగంలో జపాన్ మరింత ఒత్తిడి తెచ్చింది. 58వ నిమిషంలో షిమో కొబయకవడా బంతిని నెట్లోకి పంపింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. ఇరుజట్లూ ఆఖరి వరకూ పోరాడినా స్కోర్లు మారలేదు.
తాజా వార్తలు
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్







