మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- September 13, 2025
మహిళల హకీ ఆసియా కప్లో భారత జట్టు మరోసారి తన శక్తిని చాటుకుంది. సూరజ్ లతా దేవీ నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం జరిగిన కీలక సూపర్ 4 మ్యాచ్లో జపాన్తో 1-1తో డ్రా చేసి ఫైనల్ బెర్తు దక్కించుకుంది.ఇక మరో మ్యాచ్లో చైనా కొరియా పై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్కి ఎదురుగా నిలవనుంది. చైనా ఈ విజయంతో పట్టికలో టాప్లో నిలిచింది. భారత్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. దీంతో ఇరుజట్లు ఆదివారం ట్రోఫీ కోసం తలపడనున్నాయి.ఫైనల్లో గెలుపొందిన జట్టు వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది. అందుకే భారత్-చైనా పోరు ఆసక్తిని రేపుతోంది.
భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఆట మొదలైన 7వ నిమిషంలోనే నేహా గోయల్ గోల్ ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి ప్లేయర్ డుంగ్ డుంగ్ బంతిని ఆపినా, అది గోల్లైన్ దాటి లోపలికి వెళ్లడంతో రిఫరీ భారత్కు గోల్ ప్రకటించాడు. ఈ గోల్తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.రెండో అర్ధభాగంలో జపాన్ దాడులను పెంచింది.పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాలని ప్రయత్నించింది. కానీ భారత గోల్కీపర్ అద్భుత రక్షణతో వాటిని అడ్డుకున్నాడు. దీంతో భారత్ ఆధిక్యం కొనసాగింది.మూడో అర్ధ భాగంలో జపాన్ మరింత ఒత్తిడి తెచ్చింది. 58వ నిమిషంలో షిమో కొబయకవడా బంతిని నెట్లోకి పంపింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. ఇరుజట్లూ ఆఖరి వరకూ పోరాడినా స్కోర్లు మారలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







