మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- September 13, 2025
మహిళల హకీ ఆసియా కప్లో భారత జట్టు మరోసారి తన శక్తిని చాటుకుంది. సూరజ్ లతా దేవీ నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం జరిగిన కీలక సూపర్ 4 మ్యాచ్లో జపాన్తో 1-1తో డ్రా చేసి ఫైనల్ బెర్తు దక్కించుకుంది.ఇక మరో మ్యాచ్లో చైనా కొరియా పై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్కి ఎదురుగా నిలవనుంది. చైనా ఈ విజయంతో పట్టికలో టాప్లో నిలిచింది. భారత్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. దీంతో ఇరుజట్లు ఆదివారం ట్రోఫీ కోసం తలపడనున్నాయి.ఫైనల్లో గెలుపొందిన జట్టు వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది. అందుకే భారత్-చైనా పోరు ఆసక్తిని రేపుతోంది.
భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఆట మొదలైన 7వ నిమిషంలోనే నేహా గోయల్ గోల్ ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి ప్లేయర్ డుంగ్ డుంగ్ బంతిని ఆపినా, అది గోల్లైన్ దాటి లోపలికి వెళ్లడంతో రిఫరీ భారత్కు గోల్ ప్రకటించాడు. ఈ గోల్తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.రెండో అర్ధభాగంలో జపాన్ దాడులను పెంచింది.పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాలని ప్రయత్నించింది. కానీ భారత గోల్కీపర్ అద్భుత రక్షణతో వాటిని అడ్డుకున్నాడు. దీంతో భారత్ ఆధిక్యం కొనసాగింది.మూడో అర్ధ భాగంలో జపాన్ మరింత ఒత్తిడి తెచ్చింది. 58వ నిమిషంలో షిమో కొబయకవడా బంతిని నెట్లోకి పంపింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. ఇరుజట్లూ ఆఖరి వరకూ పోరాడినా స్కోర్లు మారలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









