ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- September 15, 2025
మస్కట్: ఒమన్ లో అడ్వాన్స్ డ్ ఎయిర్ మొబిలిటీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఒడిస్ ఏవియేషన్తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.
ఈ కార్యక్రమం అధునాతన ఎయిర్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి సమగ్ర నమూనాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిస్ అభివృద్ధి చేసిన “లైలా” విమానం కూడా ఉందని, ఇది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి హారిజంటల్ గా టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమం పైలట్ దశ 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఒడిస్ ఏవియేషన్, ప్రముఖ ప్రపంచ అధునాతన ఎయిర్ మొబిలిటీ కంపెనీలు, ఎంపిక చేసిన వ్యూహాత్మక భాగస్వాములను ఒకచోట చేర్చుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







