ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- September 17, 2025
హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిపాలన మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నలుగురు IAS అధికారులను బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను అప్పగించింది. దీని ద్వారా పరిపాలనా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా రవాణా, నగరాభివృద్ధి, విద్యా రంగాలకు సంబంధించిన విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకోవడం విశేషం.
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) ఎండీగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ, ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.మరోవైపు, HMRL నూతన ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు. మెట్రో సేవల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాత్ర కీలకమవుతుందని భావిస్తున్నారు.
నగరాభివృద్ధి రంగంలో కీలకమైన HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ నియమించబడ్డారు. అదేవిధంగా, విద్యా రంగానికి చెందిన SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలతో హైదరాబాద్ నగర అభివృద్ధి, విద్యా రంగాల్లో కొత్త దిశగా పనులు సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలపై దృష్టి సారించడాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
తాజా వార్తలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!









