ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- September 17, 2025
హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిపాలన మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నలుగురు IAS అధికారులను బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను అప్పగించింది. దీని ద్వారా పరిపాలనా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా రవాణా, నగరాభివృద్ధి, విద్యా రంగాలకు సంబంధించిన విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకోవడం విశేషం.
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) ఎండీగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ, ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.మరోవైపు, HMRL నూతన ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు. మెట్రో సేవల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాత్ర కీలకమవుతుందని భావిస్తున్నారు.
నగరాభివృద్ధి రంగంలో కీలకమైన HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ నియమించబడ్డారు. అదేవిధంగా, విద్యా రంగానికి చెందిన SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలతో హైదరాబాద్ నగర అభివృద్ధి, విద్యా రంగాల్లో కొత్త దిశగా పనులు సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలపై దృష్టి సారించడాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







