మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- September 18, 2025
దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గత రాత్రి ప్రత్యేకంగా వెలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాలను, "హ్యాపీ బర్త్డే" శుభాకాంక్షల పదాలను ప్రదర్శించింది.
ఆకర్షణీయంగా వెలిగిన బుర్జ్ ఖలీఫా రంగులు మారుతూ, భారత త్రివర్ణ పతాక రంగులు — కాషాయం, తెలుపు, ఆకుపచ్చ—మెరిశాయి.
ఇదే విధంగా గత ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకంగా అలంకరించబడింది.
ప్రధాని మోదీకి గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ప్రతీకగా ఈ ప్రత్యేక వెలుగుల ప్రదర్శన నిలిచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







