సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- September 18, 2025
న్యూ ఢిల్లీ: గత 11 ఏళ్లలో భారతదేశ విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2025 నాటికి 25 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.ఇది విమానయాన రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయంలో దేశవ్యాప్త ‘యాత్రి సేవా దివస్ 2025’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు, అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. “గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ‘ప్రధాన సేవకుడిగా’ పాలనను మార్చేశారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా భావిస్తున్నాం” అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి వివరించారు. ‘ఉడాన్’ వంటి పథకాల ద్వారా విమాన ప్రయాణం చౌకగా, సులభంగా మారిందన్నారు. ఉదాహరణకు, హిండన్ విమానాశ్రయం నుంచి 2020లో కేవలం ఒక్క సర్వీసు ఉండగా, ఇప్పుడు 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయని తెలిపారు.
డిజిటల్ సేవలు, ఆత్మనిర్భర్ భారత్
‘డిజిటల్ ఇండియా మిషన్’లో భాగంగా అతి త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదులపై వికసిత భారత్ నిర్మించడమే లక్ష్యమని, దీని కోసం విమానయాన రంగంలోని భాగస్వాములందరూ స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







