‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
- September 19, 2025
2022లో విడుదలైన "కాంతార" బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాంతారా: చాప్టర్ 1 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. కాంతారా: చాప్టర్ 1 ట్రైలర్ 22 సెప్టెంబర్ 2025న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు.
హోంబలే ఫిలింస్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో కాంతార: చాప్టర్ 1 ఒకటి. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా, అర్వింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ, వినేశ్ బాంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్.
2022లో వచ్చిన మాస్టర్పీస్ కాంతార విజయన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ ఎలాంటి రాజీ పడలేదు. ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో, 25 ఎకరాల పట్టణం నిర్మించి, దాదాపు 45–50 రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చేరువ కానుంది.
కాంతార: చాప్టర్ 1 ద్వారా హోంబలే ఫిలింస్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ







