డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- July 18, 2026
దుబాయ్: డబ్బులు తీసుకుని ఉద్యోగ, రెసిడెన్సీ లేదా విజిట్ వీసాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా ప్రచారం చేస్తున్న మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్కు చెందిన యాంటీ-ఫ్రాడ్ సెంటర్ హెచ్చరించింది.
‘బి అవేర్ ఆఫ్ ఫ్రాడ్’ (Be Aware of Fraud) అవగాహన కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన ప్రకటనలో, లైసెన్స్ లేని కంపెనీలు, కార్యాలయాల పేర్లతో లేదా ప్రభుత్వ సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ కొందరు నకిలీ ప్రకటనలు విడుదల చేస్తున్నారని తెలిపింది. ఉద్యోగాలు, రెసిడెన్సీ లేదా విజిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.
వీసాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా అధికారికంగా గుర్తింపు పొందిన కార్యాలయాల ద్వారానే పూర్తి చేయాలని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ సూచించింది. మధ్యవర్తులు లేదా నమ్మకంలేని వ్యక్తులను ఆశ్రయించవద్దని, వీసా ఆఫర్లు లేదా దరఖాస్తు ప్రక్రియల నిజానిజాలను అధికారిక మార్గాల ద్వారానే ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది.
మోసాలను అరికట్టడంలో ప్రజల్లో అవగాహన, సేవలు అందిస్తున్న సంస్థల విశ్వసనీయతను ముందుగానే నిర్ధారించుకోవడం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు లేదా వీసాలు ఇప్పిస్తామని చేసే తప్పుడు హామీలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా మోసానికి గురైనా లేదా మోసం చేసే ప్రయత్నాలను గుర్తించినా వెంటనే
దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన eCrime ప్లాట్ఫామ్ లేదా 901 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







