డైరెక్టర్ మారుతి కథ.. సాయి దుర్గ తేజ హీరో..
- September 21, 2025
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటిగ్ దశలో ఉంది. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అయితే, ఈ సినిమాకు వీడియోకి ముందే మరో భారీ సినిమాను మొదలుపెట్తాస్తున్నాడు. మిరాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి కథను అందించనున్నారు. రాజా సాబ్ లానే ఈ కథ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని టాక్. డార్లింగ్ స్వామీ మాటలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇక సాయి దుర్గ తేజ-మారుతి కాంబోలో ఇప్పటికే ప్రతీరోజు పండగే సినిమా చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాదించింది ఈ సినిమా.దాంతో, మారుతీ-సాయి దుర్గ తేజ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ ఉండనున్నాయి. మరి ఈ సినిమా ఆ మ్యాజిక్ ను క్రియేట్ అవుతుందా చూడాలి.
తాజా వార్తలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!









