డైరెక్టర్ మారుతి కథ.. సాయి దుర్గ తేజ హీరో..
- September 21, 2025
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటిగ్ దశలో ఉంది. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అయితే, ఈ సినిమాకు వీడియోకి ముందే మరో భారీ సినిమాను మొదలుపెట్తాస్తున్నాడు. మిరాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి కథను అందించనున్నారు. రాజా సాబ్ లానే ఈ కథ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని టాక్. డార్లింగ్ స్వామీ మాటలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇక సాయి దుర్గ తేజ-మారుతి కాంబోలో ఇప్పటికే ప్రతీరోజు పండగే సినిమా చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాదించింది ఈ సినిమా.దాంతో, మారుతీ-సాయి దుర్గ తేజ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ ఉండనున్నాయి. మరి ఈ సినిమా ఆ మ్యాజిక్ ను క్రియేట్ అవుతుందా చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







