దుబాయ్ మరీనా ప్రాంతంలోని సలాఫా టవర్ లో అగ్నిప్రమాదం
- July 20, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కీలక నగరం దుబాయ్లోని మరినా ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 75 అంతస్థుల సులఫా టవర్లోని స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 35వ అంతస్థులో ప్రారంభమైన మంటలు క్రమంగా మిగతా అంతస్థులకు వ్యాపించాయి. దీంతో వందలాది మంది బయటకు పరుగులు తీశారు. తమ డబ్బులు, ఇతర ముఖ్యమైన సామాగ్రి అంతా గదుల్లోనే ఉండిపోయాయని బాధితులు వాపోయారు. పర్యాటకుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. పాస్పోర్ట్లు, ఇతర కీలక ధృవపత్రాలు కూడా కాలిపోయాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









