ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- September 23, 2025
గువాహటి: అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్గా దీనిని గుర్తించారు.మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.
జుబీన్ గార్గ్ అంత్యక్రియల రోజున గువాహటి నగరం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. ఆయనను చూసేందుకు, చివరి వీడ్కోలు పలకడానికి లక్షలాది మంది అభిమానులు, కళాకారులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. భారీ రద్దీ కారణంగా నగరంలో దుకాణాలు మూసివేయబడగా, ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. కన్నీటితో ఆయనకు వీడ్కోలు పలికిన అభిమానులు గువాహటిని శోకసంద్రంగా మార్చేశారు.
జుబీన్ గార్గ్ అస్సాంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంగీతానికి చేసిన కృషి అమూల్యం. ఆయన గళం అనేక తరాల హృదయాలను తాకింది. అంత్యక్రియలకు హాజరైన ప్రజల సంఖ్య ఆయనకు ఉన్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన అంత్యక్రియలకు చోటు దక్కడం కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, సంగీత రంగానికి ఆయన అందించిన సేవలకు దేశం మొత్తంగా నివాళి అర్పించినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







