సుప్రీంకోర్టు సూచనలను స్వాగతించిన తెలంగాణా సీఎం
- July 20, 2016
పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







