చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ

- July 20, 2016 , by Maagulf
చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనాకు చెందిన గుజో మారిటైమ్‌ సిల్క్‌ రూట్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్‌ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన... ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com