రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- September 26, 2025
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4జీ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ సేవలు దేశవ్యాప్తంగా వినియోగదారులకు లభ్యం కానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను తీసుకురావడం గమనార్హం.
ఈ 4జీ సేవలు ఒక క్లౌడ్ ఆధారిత నెట్వర్క్(network) అని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 5జీకి సులువుగా అప్గ్రేడ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్వర్క్ను ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో గౌహతిలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ప్రారంభోత్సవం ఒకేసారి జరగనుంది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







