అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- March 12, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇవాళ ఢిల్లీలో 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అటల్ జీ తో పని చేసిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు.భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై వెంకయ్య నాయుడు సుదీర్ఘంగా చర్చించారు.
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, జి.కిషన్ రెడ్డి, పూర్వకేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ,సయ్యద్ షానవాజ్ హుస్సేన్, రాజీవ్ ప్రతాప్ రూడీ,ఏబీవీపీ (ABVP) పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భాటియా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పూర్వ ప్రధాని అటల్ జీకి మీడియా సలహాదారు అశోక్ టాండన్, పూర్వ ప్రధానికి నాటి ఓఎస్డీ రాజ్ కుమార్ శర్మ తదితరులతో చర్చించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..అటల్ జీ ఒక మహోన్నత నాయకుడని, ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అటల్ జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సొసైటీ కార్యకలాపాలకు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







