NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- September 28, 2025
మిస్సౌరీ: 'సమాజ సేవలో మేము సైతం' అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే సెయింట్ లూయిస్లోని మహాత్మా గాంధీ సెంటర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం,ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం ఎంతో మంది తెలుగువారితో పాటు స్థానికులకు ఉపయోగపడింది.ఈ వైద్య శిబిరంలో రోగులకు నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. ఫ్లూ టీకాలను ఉచితంగా అందించడంలోడాక్టర్ ఏజే కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత నాట్స్ బోర్డ్ సభ్యులు సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సౌరీ విభాగం కో-ఆర్డినేటర్ సందీప్ కొల్లిపార, జాయింట్ కో-ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిస్ట్ల తదితరులతో పాటు వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం కోసం తమ విలువైన సమయాన్ని, సేవలను అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షల కోసం, ఫ్లూ టీకాలు తీసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. టీకాలు వేయించుకున్నారు. మిస్సోరీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు ప్రత్యేకంగా అభినందించారు.

తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









