ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- September 29, 2025
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దాతల సహకారంతో 35 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు ఒక్కో యూనిట్ పై 0.13పైసలు తగ్గిస్తున్నామని తెలిపారు. అంతకుముందు అద్దంకి పట్టణంలోని శ్రీ చక్రాసహిత వాసవి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







