ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- September 29, 2025
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దాతల సహకారంతో 35 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు ఒక్కో యూనిట్ పై 0.13పైసలు తగ్గిస్తున్నామని తెలిపారు. అంతకుముందు అద్దంకి పట్టణంలోని శ్రీ చక్రాసహిత వాసవి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







