ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- October 03, 2025
కువైట్: కేరళ నుండి నడిచే అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మార్పులు చేసింది. ఇందులో కీలకమైన గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రధాన కార్యాలయాన్ని కొచ్చి నుండి హర్యానాలోని గురుగ్రామ్కు మార్చింది. దీంతో కేరళ నుండి వారానికి ఏడు సార్లు నడిచే ఫ్లైట్స్.. ఇప్పుడు సగానికి తగ్గనున్నాయి.
తిరువనంతపురం నుండి దుబాయ్, అబుదాబి, మస్కట్, కువైట్, షార్జా, రియాద్ మరియు జెడ్డాకు నడిచే ఫ్లైట్ సర్వీసుల్లో కొన్ని మార్గాలను రద్దు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ క్యారియర్లు ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఎమిరేట్స్ వంటి ఖరీదైన విమానయాన సంస్థలకు మారుతున్నారు. కేరళలో కార్యకలాపాలను తగ్గించి, ఉత్తర భారతదేశానికి విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా అంతకుముందు ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిర్ణయంతో కువైట్ లో కేరళ ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









