ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- October 03, 2025
కువైట్: కేరళ నుండి నడిచే అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మార్పులు చేసింది. ఇందులో కీలకమైన గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రధాన కార్యాలయాన్ని కొచ్చి నుండి హర్యానాలోని గురుగ్రామ్కు మార్చింది. దీంతో కేరళ నుండి వారానికి ఏడు సార్లు నడిచే ఫ్లైట్స్.. ఇప్పుడు సగానికి తగ్గనున్నాయి.
తిరువనంతపురం నుండి దుబాయ్, అబుదాబి, మస్కట్, కువైట్, షార్జా, రియాద్ మరియు జెడ్డాకు నడిచే ఫ్లైట్ సర్వీసుల్లో కొన్ని మార్గాలను రద్దు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ క్యారియర్లు ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఎమిరేట్స్ వంటి ఖరీదైన విమానయాన సంస్థలకు మారుతున్నారు. కేరళలో కార్యకలాపాలను తగ్గించి, ఉత్తర భారతదేశానికి విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా అంతకుముందు ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిర్ణయంతో కువైట్ లో కేరళ ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







