చింతకాయ పచ్చిచేపల కూర
- July 21, 2016
కావలసిన పదార్ధాలు:
చేపలు : అరకిలో , చింతకాయలు : పెద్దవి ఆరు , ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు , కారం : మూడు టేబుల్ స్పూన్లు , అల్లం-వెల్లుల్లి ముద్ద : రెండు టీస్పూన్లు , ఉల్లి పాయలు : రెండు ముక్కలుగా కొయ్యాలి , పచ్చిమిర్చి : మూడు ముక్కలు చెయ్యాలి , పసుపు : 1 టీ స్పూన్ , నూనె : 6 టేబుల్ స్పూన్లు , కరివేపాకు : కొద్దిగా , కొత్తిమిర : కొద్దిగా , జీలకర్ర : 1 టీ స్పూన్
తయారు చేయు విధానం:
చేపలు బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కనపెట్టాలి. చింతకాయలు కడిగి ఉడకబెట్టి, చల్లారిన తరువాత రసం తీసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన అల్లంవెల్లుల్లి, ధనియాలపొడి వేసి కలిపి, చేప ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి చింతకాయల రసం వేసి మూతపెట్టాలి. పది నిముషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే గుమగుమలాడే చింతకాయ చేపల పులుసు రెడి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









