ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- October 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్జెండర్ల చర్యలు అదుపు తప్పాయని, వారు బహిరంగంగా రూపాయలు వేలు డిమాండ్ చేస్తూ.. ఇవ్వని వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కమిషనర్ సజ్జనార్ను ట్యాగ్ చేశారు.
ఈ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ స్పందించారు.ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఆయన జవాబిచ్చారు. ఆరోపణలలోని నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని ధృవీకరించిన తర్వాత చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







