ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- October 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్జెండర్ల చర్యలు అదుపు తప్పాయని, వారు బహిరంగంగా రూపాయలు వేలు డిమాండ్ చేస్తూ.. ఇవ్వని వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కమిషనర్ సజ్జనార్ను ట్యాగ్ చేశారు.
ఈ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ స్పందించారు.ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఆయన జవాబిచ్చారు. ఆరోపణలలోని నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని ధృవీకరించిన తర్వాత చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!







