త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. జగన్
- July 21, 2016
'బెజవాడ వెళ్లిపోదాం.. ఆఫీసు చూడండి' అని పార్టీ సీనియర్ నేతలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రాజకీయ పక్షాలన్నీ విజయవాడలోనో లేదా గుంటూరులోనో పార్టీ కార్యాలయాలను తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే, కాంగ్రెస్ విజయవాడలోని నగర కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చుకుంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇంకా హైదరాబాద్ నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. గురువారం సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. పార్టీ కార్యాలయం చూడాలని సీనియర్ నేత సత్తిబాబుతో జగన్ అన్నారు. దీంతో.. ఆగస్టు 3వ తేదీ తర్వాత పార్టీ కార్యాలయాన్ని చూసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







