సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాలు.
- July 21, 2016
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాల్లో గురువారం అమెరికా సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 15 మంది చిన్నారులుసహా 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని డమాస్కస్కు తూర్పున ఉన్న గౌట ప్రాంతంలో దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారని 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ తెలిపింది. డ్యూమాలోనూ దాడులు కొనసాగాయని ఏఎఫ్పీ ఫొటోగ్రాఫర్ తెలిపారు.అలెప్పో సమీపంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులుసహా 15 మంది చనిపోయారు. అలెప్పో సిటీ గత రెండు వారాలుగా సైన్యం ముట్టడిలో ఉంది. ఇడ్లిబ్కు నైరుతి దిశలో ఉన్న వేర్వేరు ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో మొత్తం 30 మంది మరణించారు. 2011 మార్చిలో దేశంలో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2,80,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు సగం దేశజనాభా స్వస్థలాలను వదిలివెళ్లింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







