భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- October 10, 2025
న్యూ ఢిల్లీ: అమెరికాలో చదువు అవకాశాలు తగ్గుతున్న వేళ, ఇతర దేశాలు భారత విద్యార్థులను ఆకర్షించేందుకు ముందుకొస్తున్నాయి.ఇప్పటికే చైనా, యూకేలు తమ దేశాల్లో చదువు అవకాశాల కోసం భారతీయ విద్యార్థులను ఆహ్వానించగా, ఇప్పుడు బ్రిటన్ యూనివర్సిటీలు నేరుగా భారత్లోకి వస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాధినేతలు విద్యా రంగంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీని ప్రకారం తొమ్మిది ప్రముఖ యూకే యూనివర్సిటీలు భారతదేశంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. స్టార్మర్తో పాటు యూకే విద్యా ప్రతినిధి బృందం కూడా భారత్ను సందర్శించింది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే గురుగ్రామ్లో తన క్యాంపస్ను ప్రారంభించింది, మొదటి బ్యాచ్ విద్యార్థులు కూడా చేరారు.
ఈ ఒప్పందం ద్వారా భారతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్లకుండా ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యను పొందగలరని ప్రధాని మోదీ తెలిపారు. ఇది ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుందని ఆయన అన్నారు. ఐదు ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలు ప్రధాన భారతీయ నగరాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబైలో ఎంటర్ప్రైజ్ క్యాంపస్ ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుమతి పొందింది. ఈ క్యాంపస్లు 2026 వేసవిలో విద్యార్థులను స్వాగతించనున్నాయి.
తాజా వార్తలు
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్









