భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- October 10, 2025
న్యూ ఢిల్లీ: అమెరికాలో చదువు అవకాశాలు తగ్గుతున్న వేళ, ఇతర దేశాలు భారత విద్యార్థులను ఆకర్షించేందుకు ముందుకొస్తున్నాయి.ఇప్పటికే చైనా, యూకేలు తమ దేశాల్లో చదువు అవకాశాల కోసం భారతీయ విద్యార్థులను ఆహ్వానించగా, ఇప్పుడు బ్రిటన్ యూనివర్సిటీలు నేరుగా భారత్లోకి వస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాధినేతలు విద్యా రంగంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీని ప్రకారం తొమ్మిది ప్రముఖ యూకే యూనివర్సిటీలు భారతదేశంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. స్టార్మర్తో పాటు యూకే విద్యా ప్రతినిధి బృందం కూడా భారత్ను సందర్శించింది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే గురుగ్రామ్లో తన క్యాంపస్ను ప్రారంభించింది, మొదటి బ్యాచ్ విద్యార్థులు కూడా చేరారు.
ఈ ఒప్పందం ద్వారా భారతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్లకుండా ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యను పొందగలరని ప్రధాని మోదీ తెలిపారు. ఇది ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుందని ఆయన అన్నారు. ఐదు ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలు ప్రధాన భారతీయ నగరాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబైలో ఎంటర్ప్రైజ్ క్యాంపస్ ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుమతి పొందింది. ఈ క్యాంపస్లు 2026 వేసవిలో విద్యార్థులను స్వాగతించనున్నాయి.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







