హైదరాబాద్లో స్టార్టప్ సమ్మిట్
- October 18, 2025
హైదరాబాద్: హైదరాబాద్లో పారిశ్రామిక రంగాన్ని, స్టార్టప్ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ‘ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్’ ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సు అక్టోబర్ 31 మరియు నవంబర్ 1 తేదీల్లో మాదాపూర్ హైటెక్స్లో రెండు రోజులపాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక సంఘం అయిన TiE Globalలో భాగంగా టీఐఈ హైదరాబాద్ ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది.
ఈ సమ్మిట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సహా 25కు పైగా పెట్టుబడి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. దాదాపు 1,500 మందికి పైగా పారిశ్రామికులు, విధాన నిర్ణేతలు, వ్యవస్థాపకులు, అలాగే 500కిపైగా స్టార్టప్ కంపెనీలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ & డీప్ టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్టెక్, ఫిన్టెక్, తయారీ, డిఫెన్స్ & ఏరోస్పేస్ వంటి 20 ప్రధాన రంగాలపై చర్చలు జరుగుతాయి.
సదస్సు సందర్భంగా వ్యవస్థాపకతలో విశేష కృషి చేసిన వారికి ‘TiE ఎక్సలెన్స్ అవార్డులు’,
మరియు తెలంగాణలోని అత్యంత ఆశాజనకమైన 50 స్టార్టప్లకు ‘TiE 50 అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. టీఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల మాట్లాడుతూ, ఈ సమ్మిట్ స్టార్టప్లకు నిధుల సమీకరణ, జాతీయ స్థాయి గుర్తింపు, మరియు భాగస్వామ్య అవకాశాలను అందిస్తుందని తెలిపారు. గత ఏడాది హైదరాబాద్లో స్టార్టప్ నిధుల సేకరణ 160% పెరిగి $571 మిలియన్కి చేరిన నేపథ్యంలో, ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను పొందింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









