కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తీసుకొచ్చే అంశంపై చర్చలు

- July 22, 2016 , by Maagulf
కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తీసుకొచ్చే అంశంపై చర్చలు

ప్రఖ్యాత కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ ఈ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. 108 క్యారట్ల వజ్రాన్ని పొదిగిన కిరీటాన్ని ప్రస్తుతం టవర్‌ ఆఫ్‌ లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. వజ్రాన్ని బ్రిటన్‌ బలవంతంగాగానీ, దొంగతనం ద్వారాగానీ తీసుకెళ్లలేదనీ, నాటి పంజాబ్‌ పాలకులు ఈస్టిండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని కేంద్రం ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే విషయంలో న్యాయపరమైన, సాంకేతిక అవరోధాలున్నాయని పేర్కొంది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్ని రకాలుగా కృషిచేస్తామని ప్రకటించింది. ఈ సమస్యకు సంతృప్తికరమైన పరిష్కారం కోసం విదేశీ వ్యవహారాల శాఖ తగిన మార్గాల కోసం వెదుకుతోందని మేలో కేంద్రమంత్రి మహేశ్‌శర్మ పార్లమెంటుకు తెలిపారు. దీనిపై భారత్‌సహా నాలుగు దేశాలు హక్కులు కోరుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com