పార్కుల తనిఖీలు

- July 22, 2016 , by Maagulf
పార్కుల తనిఖీలు

నగరంలోని పార్కులను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని వెంగళరావుపార్క్‌లో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే చింతల, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పార్కు సిబ్బంది మంత్రి వద్ద చెప్పుకున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి పిలుపునకు స్పందించిన మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ దాన కిషోర్‌ వెంగళరావు పార్క్‌ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com