మే 19వ తేదీ విమానం.. గాల్లోనే రెండు ముక్కలు!
- July 22, 2016
విమానం గాల్లో ఉండగానే దానికి మంటలు అంటుకుని.. రెండు ముక్కలైపోయింది! అవును.. రెండు నెలల క్రితం కూలిపోయిన ఈజిప్షియన్ ఎయిర్ లైన్స్ విమానం గురించిన ఈ దిగ్భ్రాంతికర వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్ పిట్ సమీపంలో లేదా లోపల మంటలు చెలరేగడంతో.. విమానం గాల్లో ఉండగానే రెండు ముక్కలై మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఈజిప్టు విచారణాధికారుల బృందం చెప్పింది. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. విమానంలో సాంకేతిక లోపం వల్ల వచ్చాయా, లేక ఏదైనా విద్రోహ చర్య అందుకు కారణమా అనేది తెలియాల్సి ఉంది.ఎయిర్ బస్ ఎ320 రకానికి చెందిన ఈ విమానం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 66 మందీ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







