మే 19వ తేదీ విమానం.. గాల్లోనే రెండు ముక్కలు!
- July 22, 2016
విమానం గాల్లో ఉండగానే దానికి మంటలు అంటుకుని.. రెండు ముక్కలైపోయింది! అవును.. రెండు నెలల క్రితం కూలిపోయిన ఈజిప్షియన్ ఎయిర్ లైన్స్ విమానం గురించిన ఈ దిగ్భ్రాంతికర వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్ పిట్ సమీపంలో లేదా లోపల మంటలు చెలరేగడంతో.. విమానం గాల్లో ఉండగానే రెండు ముక్కలై మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఈజిప్టు విచారణాధికారుల బృందం చెప్పింది. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. విమానంలో సాంకేతిక లోపం వల్ల వచ్చాయా, లేక ఏదైనా విద్రోహ చర్య అందుకు కారణమా అనేది తెలియాల్సి ఉంది.ఎయిర్ బస్ ఎ320 రకానికి చెందిన ఈ విమానం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 66 మందీ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









