పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- October 30, 2025
ఆఫ్ఘనిస్థాన్–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ బలమైన ప్రతిస్పందన ఇచ్చింది. విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, “భారత్ ఎప్పటిలాగే ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు. అతను పాకిస్థాన్ వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ, “సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ తమ హక్కుగా భావిస్తోంది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతలకు ప్రమాదకరం” అన్నారు.
ఇటీవల టర్కీ వేదికగా జరిగిన పాక్–ఆఫ్ఘాన్(Pakistan Afghanistan Clash) చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ – “భారతం కారణంగానే ఈ చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్లు భారత్ చేతిలో కీలుబొమ్మలుగా మారారు” అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేస్తూ – “ఇలాంటి నిరాధార ఆరోపణలు పాకిస్థాన్ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే. ఆఫ్ఘన్ తమ భూభాగాన్ని స్వయంగా పాలించుకోవడాన్ని పాక్ సహించలేకపోతోంది” అన్నారు. భారత్ ఎప్పటికీ ప్రాంతీయ శాంతి, సార్వభౌమ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో పాక్ ఆఫ్ఘనిస్థాన్పై వాయు దాడులు జరపడం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమైంది. భారత్, ఈ నేపథ్యంలో, హింస కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ యొక్క ఈ స్తంభన, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పట్ల తన కట్టుబాటును మరోసారి చాటింది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







