మెక్డొనాల్డ్ ప్రమాదం తర్వాత భద్రత జట్టు ఏర్పాటు

- July 23, 2016 , by Maagulf
మెక్డొనాల్డ్ ప్రమాదం తర్వాత  భద్రత జట్టు ఏర్పాటు

         

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు వ్యక్తులు  గాయపడ్డారు ఆ విషాద ప్రమాద అనుభవ నేపథ్యంలో, అజ్మన్  మున్సిపాలిటీ శాఖ  అటువంటి ప్రమాదాల బారిన ప్రజలు  పడకుండా నిరోధించడానికి ప్రత్యేక రక్షణ జట్టు ఏర్పాటు చేసింది. కొత్త కమ్యూనిటీ భద్రతా గణంలో  మునిసిపాలిటి నుండి ప్రత్యేక రక్షణ నిపుణులు వుంటారు. వీరు వాహనాల అద్దాల ముందు కనబడేలా  సరిహద్దుల లేదా పట్టణ శివారు సమీపంలో భద్రతా సూచనలను తెలియచేసే  బోర్డులు ఏర్పాటు చేయడం చేస్తారు. సందర్శకులు లేదా వినియోగదారులకు యొక్క భద్రతా నిర్ధారించడానికి కఠినమైన నిబంధనలు, షరతులు అనుసరించాల్సి ఉంటుంది.

ఎమిరేట్ లో ప్రజా భద్రత తులనాత్మకంగా తక్కువ ప్రాణాంతకం చేసేందుకు  ఈ  జట్టు అధిక భద్రతా స్థాయిలు,  ట్రాఫిక్ ప్రమాదాలు నిర్ధారించడానికి జూలై 19 న ఏర్పాటు కాబడిన  ఒక అత్యవసర కమిటీ భాగం. ఇది నిరంతరం రోడ్డు ప్రమాదంలో కారణాలు మరియు ప్రజలకు దగ్గరగా మెలిగి అజ్మన్  ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో ప్రమాద నివారణ ప్రయత్నాలకు  అధ్యయనం చేయాల్సి ఉంది. అజ్మన్  మున్సిపాలిటీ యొక్క ఇంజనీరింగ్ వ్యవహారాల శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  మహమ్మద్ బిన్ ఆమిర్  అల్ ముహారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, భద్రత జట్టు నగరంలో వ్యాపార సంస్థలలోని దుకాణాలు  మరియు కాంప్లెక్సులు సమీపంలో బాటసారులను రక్షించడానికి విధానాలు మరియు చర్యలను ఒక అధ్యయనం చేయనున్నట్లు  తెలిపారు. పురపాలక సంఘం ఎమిరేట్ ప్రజా భద్రత మరియు భద్రతా పరిస్థితులపై ప్రతి మూడు నెలల ఒకసారి ఒక సమగ్ర  నివేదిక జారీ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com