తెలంగాణలో మోదీ పర్యటన ఖరారు

- July 23, 2016 , by Maagulf
తెలంగాణలో  మోదీ పర్యటన ఖరారు

తెలంగాణలో భారత ప్రధాని మోదీ పర్యటన దాదాపు ఖరారైంది. ఈ షెడ్యూల్‌ను పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో కోరడంతో శనివారం సాయంత్రం అందజేసింది. ఆగస్టు 7న రామగుండం ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో మిషన్‌ భగీరథను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్..మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలసిందే. శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మోదీ మెదక్‌ జిల్లా ములుగులో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com