తెలంగాణలో మోదీ పర్యటన ఖరారు
- July 23, 2016
తెలంగాణలో భారత ప్రధాని మోదీ పర్యటన దాదాపు ఖరారైంది. ఈ షెడ్యూల్ను పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో కోరడంతో శనివారం సాయంత్రం అందజేసింది. ఆగస్టు 7న రామగుండం ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం, వరంగల్ టెక్స్టైల్ పార్కుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గజ్వేల్లో మిషన్ భగీరథను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్..మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలసిందే. శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మోదీ మెదక్ జిల్లా ములుగులో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







