ఈత తెలియని దుబాయ్ వ్యక్తి సముద్రంలో మునిగి మృతి

- July 23, 2016 , by Maagulf
ఈత తెలియని దుబాయ్ వ్యక్తి  సముద్రంలో మునిగి మృతి

ఈత తెలియని ఏకంగా సముద్రం లో ఈత కొట్టేందుకు వెళ్ళి నీట మునిగి మృతి చెందాడు  దుబాయ్ కు చెందిన ఈ వ్యక్తి  మృతదేహాన్ని స్వస్థలానికి అధికారులు పంపనున్నారు.ఈ నెల ప్రారంభంలో తన మిత్రబృందంతో కల్సి ఈత కొట్టేందుకు సముద్రంకు వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి తమతో లేదని  తప్పిపోయాడని మిత్రబృందం గ్రహించింది.

ఉమ్ అల్ క్యువాయిన్ మరియు రస అల్ ఖైమః  మధ్య సముద్రంలో చనిపోయిన సుఖిల్  (34), దుబాయ్ నివాసి.  పారామౌంట్  అంతర్జాతీయ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఫోర్మెన్ గా పనిచేస్తున్నాడు.నీట మునిగి చనిపోయిన ఈ వ్యక్తితో ఈతకు వెళ్ళిన స్నేహితుల బృందాన్ని  ఉమ్ అల్ క్యువాయిన్ పోలీసులు  ప్రశ్నిస్తున్నారు  మరియు అతని మరణంపై పరిశోధనలు జరిపి పోస్టుమార్టం నివేదికల ద్వారా సుఖిల్ నీట మునిగి చనిపోయాడని నిర్ధారణకు పోలీసులు వచ్చారు. భౌతికదేహాన్ని  అతని స్వదేశానికి గత వారాంతంలో పంపించారు . సుఖిల్  బ్రహ్మచారి కాగా అతని తల్లిదండ్రులను ఏకైక పెద్ద కొడుకు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com