మాతృభాష
- July 17, 2015
అనగనగా రామాపురం, సీతాపురం అనే రెండు ఊళ్లు పక్కపక్కనే ఉండేవి. ఆ రెండింటికీ ఎప్పుడూ ప్రతీ విషయంలోనూ పోటీ ఉండేది. ఒకరోజు రామాపురం నుండి సీతాపురం ఊరిలోకి సుబ్బయ్య అనే పండితుడు వచ్చి నాకు పది భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఎంత ప్రావీణ్యం అంటే నా మాతృభాష ఏదో కూడా కనిపెట్టలేనంత.. అన్నాడు. దమ్ముంటే మీ ఊరిలోని పండితుడెవరైనా వచ్చి నా మాతృభాష ఏదో కనిపెట్టగలరేమో కనుక్కోండి చూద్దాం అని సవాల్ విసిరాడు. అందుకు ఆ ఊరి పెద్ద ఈ బాధ్యతను ఆ ఊరి పండితుడు చైత్రయ్యకు ఈ పనిని అప్పగించగా.. చైత్రయ్య, సుబ్బయ్యను చాలా విధాలుగా ప్రయత్నించి చూశాడు. కానీ కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఒక ఉపాయం ఆలోచించి సుబ్బయ్య నిద్రపోయాక అతని గది వద్దకు ఒక కోరలు తీసిన పాముని పంపించాడు. ఆ పాము అతని గది కిటికీ గుండా వెళ్లి మంఛం మీద నిద్రపోతున్న సుబ్బయ్య మీదకి ఎక్కి బుసలు కొట్టసాగింది. దాంతో అకస్మాత్తుగా నిద్ర మేల్కొని, 'అమ్మోయ్, బాబోయ్ కాపాడండి కాపాడండి' అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఎంత గొప్పవారైనా సరే బాధ కలిగినపుడు, కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా తన మాతృ భాషలోనే ఉచ్ఛరిస్తారు. దాంతో అతని మాతృభాష 'తెలుగు' అని అందరికీ తెలిసింది. దాంతో చైత్రయ్యను ఊరి పెద్దతో పాటు ఊరి జనం కూడా మెచ్చుకుని అభినందనలతో ముంచెత్తారు. సుబ్బయ్య తన గర్వభంగానికి సిగ్గుతో తల వంచుకుని చైత్రయ్యకు, ఊరి జనానికి క్షమాపణలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







