మాతృభాష
- July 17, 2015
అనగనగా రామాపురం, సీతాపురం అనే రెండు ఊళ్లు పక్కపక్కనే ఉండేవి. ఆ రెండింటికీ ఎప్పుడూ ప్రతీ విషయంలోనూ పోటీ ఉండేది. ఒకరోజు రామాపురం నుండి సీతాపురం ఊరిలోకి సుబ్బయ్య అనే పండితుడు వచ్చి నాకు పది భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఎంత ప్రావీణ్యం అంటే నా మాతృభాష ఏదో కూడా కనిపెట్టలేనంత.. అన్నాడు. దమ్ముంటే మీ ఊరిలోని పండితుడెవరైనా వచ్చి నా మాతృభాష ఏదో కనిపెట్టగలరేమో కనుక్కోండి చూద్దాం అని సవాల్ విసిరాడు. అందుకు ఆ ఊరి పెద్ద ఈ బాధ్యతను ఆ ఊరి పండితుడు చైత్రయ్యకు ఈ పనిని అప్పగించగా.. చైత్రయ్య, సుబ్బయ్యను చాలా విధాలుగా ప్రయత్నించి చూశాడు. కానీ కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఒక ఉపాయం ఆలోచించి సుబ్బయ్య నిద్రపోయాక అతని గది వద్దకు ఒక కోరలు తీసిన పాముని పంపించాడు. ఆ పాము అతని గది కిటికీ గుండా వెళ్లి మంఛం మీద నిద్రపోతున్న సుబ్బయ్య మీదకి ఎక్కి బుసలు కొట్టసాగింది. దాంతో అకస్మాత్తుగా నిద్ర మేల్కొని, 'అమ్మోయ్, బాబోయ్ కాపాడండి కాపాడండి' అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఎంత గొప్పవారైనా సరే బాధ కలిగినపుడు, కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా తన మాతృ భాషలోనే ఉచ్ఛరిస్తారు. దాంతో అతని మాతృభాష 'తెలుగు' అని అందరికీ తెలిసింది. దాంతో చైత్రయ్యను ఊరి పెద్దతో పాటు ఊరి జనం కూడా మెచ్చుకుని అభినందనలతో ముంచెత్తారు. సుబ్బయ్య తన గర్వభంగానికి సిగ్గుతో తల వంచుకుని చైత్రయ్యకు, ఊరి జనానికి క్షమాపణలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







