‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
- November 11, 2025
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా వుంది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







