రైలు ప్రయాణికులకు శుభవార్త..!!
- July 24, 2016
రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు త్వరలోనే రైళ్లలో రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట 1000 రైళ్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రేడియోలో ప్రయాణికులకు పాటలతో పాటు రైలుకు సంబంధించిన సమాచారం అందించనుంది. రైల్వే చరిత్ర, ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సౌకర్యాలను, ఏదైనా అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రముఖ రేడియో సంస్థలతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభు 2016-17 బడ్జెట్లో ప్రజలకు వినోదం అందించేందుకు రైలు రేడియోల ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సౌకర్యం శతాబ్ది, రాజధాని రైళ్లలో మాత్రమే ఉంది. మిగతా రైళ్లలో కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ రైలు రేడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం సులభతరమౌతుంది. దీంతో పాటు ప్రస్తుతం ప్రముఖ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్న రైలుబంధు అనే ద్విభాషా మ్యాగజైన్ను కూడా అన్ని రైళ్లలోకి, అన్ని భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









