రైలు ప్రయాణికులకు శుభవార్త..!!
- July 24, 2016
రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు త్వరలోనే రైళ్లలో రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట 1000 రైళ్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రేడియోలో ప్రయాణికులకు పాటలతో పాటు రైలుకు సంబంధించిన సమాచారం అందించనుంది. రైల్వే చరిత్ర, ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సౌకర్యాలను, ఏదైనా అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రముఖ రేడియో సంస్థలతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభు 2016-17 బడ్జెట్లో ప్రజలకు వినోదం అందించేందుకు రైలు రేడియోల ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సౌకర్యం శతాబ్ది, రాజధాని రైళ్లలో మాత్రమే ఉంది. మిగతా రైళ్లలో కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ రైలు రేడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం సులభతరమౌతుంది. దీంతో పాటు ప్రస్తుతం ప్రముఖ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్న రైలుబంధు అనే ద్విభాషా మ్యాగజైన్ను కూడా అన్ని రైళ్లలోకి, అన్ని భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







