'మజ్ను' గా మారిన నాని
- July 24, 2016
నాని కథానాయకుడిగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. పి.కిరణ్ నిర్మాత. తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేశారు. 29 ఏళ్ల క్రితం నాగార్జున కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది. 'ప్రేమమ్' చిత్రానికి 'మజ్ను' అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే 'మజ్ను'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









