కారు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఆన్లైన్లో మాత్రమే
- July 24, 2016
కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ (మూడేళ్ళలోపు) కేవలం ఆన్లైన్లో ద్వారా మాత్రమే ఇక నుంచి జరుగుతుంది. ఆగస్ట్ 15 నుంచి ఆర్టిఎ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మరో రెండు సర్వీసులు ఆన్లైన్లోకి ఆగస్ట్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రీప్లేస్మెంట్ లేదా పోగొట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్డ్ని తిరిగి పొందడం, అలాగే లైసెన్స్ ప్లేట్ రిటెన్షన్ వంటివి ఆర్టిఏ వెబ్సైట్ ద్వారా పొందనడానికి వీలుంది. డ్రైవర్స్ అండ్ వెహికిల్స్ యాప్, ఆర్టిఎ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ల ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. టెస్టింగ్ అవసరం లేని వాహనాల రిజిస్ట్రేషన్, పోగొట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్డ్ని కొత్తగా పొందడం, నంబర్ రెన్యువల్ రిటెన్షన్ సర్వీస్ వంటివి ఆన్లైన్లో మాత్రమే జరుగుతాయనీ, అయితే దీనికిగాను వాహనాలు మూడేళ్ళ లోపు వయసున్నవి మాత్రమే అయి ఉండాలని ఆర్టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ బహ్రూజియన్ చెప్పారు. ఆన్లైన్ ద్వారా సమయం వృధాని అరికట్టగలుగుతున్నామనీ, మెరుగైన సేవలు తేలిగ్గా అందరికీ అందజేయగలుగుతున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







