రియో ఒలింపిక్స్‌ లో భారత్‌ కు మరో ఎదురుదెబ్బ..

- July 24, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌ లో  భారత్‌ కు మరో ఎదురుదెబ్బ..

రియో ఒలింపిక్స్‌కు ముందు భారత్‌ మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో రెజ్లర్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. రెజ్లర్ సందీప్ తులసి యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణయింది.భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్ధారించింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో అతను బరిలో దిగే అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తనను కుట్రపూరితంగా ఇరికించారని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com