లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- November 17, 2025
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో నిర్వహించిన ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా కీలక రంగాలలో పనిచేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో పాల్గొన్న సంస్థలు:
- NCL–నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
- NFL–నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
- MOIL–మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్
- RITES–రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీసెస్
- WAPCOS–వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్
సంస్థల పనితీరు,ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృత చర్చలు జరిగాయి. ప్రజా రంగ సంస్థల అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక బలోపేతం వంటి అంశాలపై సూచనలు, సమీక్షలు ప్రధానంగా చర్చించబడ్డాయి.ఎంపీ బాలశౌరి ఈ చర్చల్లో సక్రియంగా పాల్గొని పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!







