డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- March 11, 2026
దోహా: పేలుళ్లు లేదా ఆకాశం నుండి పడిపోతున్న వస్తువులు, శకలాలకు దూరంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది.అలాంటి వస్తువులను సమీపించవద్దని, తాకవద్దని లేదా తరలించవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలు ఈ ఆదేశాన్ని పాటించడం ఎంత ముఖ్యమో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
శకలాలు తీవ్రమైన గాయాలకు కారణమవుతాయని,ఎందుకంటే అవి తాకినట్లయితే లోతైన గాయాలు లేదా రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
పేలుళ్ల తర్వాత ఇటువంటి పదార్థాలు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయని, వాటిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు అవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొన్ని శలాలు పేలకుండా ఉండే అవకాశం ఉండవచ్చని, వాటిని తరలించినా లేదా తాకినా పేలుడు సంభవించవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, పేలుళ్ల నుండి వచ్చే శలాల్లో ఇంధన అవశేషాలు, రసాయనాలు లేదా పేలుడు నుండి వచ్చే ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉండవచ్చని, వీటిని టచ్ చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పేర్కొంది.
దాంతోపాటు శకలాలను తరలించడం వల్ల సంఘటనల కారణాన్ని గుర్తించడానికి అవశేషాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనికి ఆటంకం కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అలాంటి వస్తువులను గుర్తించిన వెంటనే 999కి కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







