డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- March 11, 2026
దోహా: పేలుళ్లు లేదా ఆకాశం నుండి పడిపోతున్న వస్తువులు, శకలాలకు దూరంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది.అలాంటి వస్తువులను సమీపించవద్దని, తాకవద్దని లేదా తరలించవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలు ఈ ఆదేశాన్ని పాటించడం ఎంత ముఖ్యమో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
శకలాలు తీవ్రమైన గాయాలకు కారణమవుతాయని,ఎందుకంటే అవి తాకినట్లయితే లోతైన గాయాలు లేదా రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
పేలుళ్ల తర్వాత ఇటువంటి పదార్థాలు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయని, వాటిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు అవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొన్ని శలాలు పేలకుండా ఉండే అవకాశం ఉండవచ్చని, వాటిని తరలించినా లేదా తాకినా పేలుడు సంభవించవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, పేలుళ్ల నుండి వచ్చే శలాల్లో ఇంధన అవశేషాలు, రసాయనాలు లేదా పేలుడు నుండి వచ్చే ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉండవచ్చని, వీటిని టచ్ చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పేర్కొంది.
దాంతోపాటు శకలాలను తరలించడం వల్ల సంఘటనల కారణాన్ని గుర్తించడానికి అవశేషాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనికి ఆటంకం కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అలాంటి వస్తువులను గుర్తించిన వెంటనే 999కి కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









