33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 18, 2025
మనామా: బహ్రెయిన్ లో 33వ ఎడిషన్ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సఖిర్లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో ఈ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ను టూరిజం మినిస్టర్ ఫాతిమా బింట్ జాఫర్ అల్-సిరాఫీ ప్రారంభించారు. అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ బహ్రెయిన్ను లగ్జరీ వాణిజ్య ప్రదర్శనలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపిందని తెలిపారు. బహ్రెయిన్ పర్యాటక అభివృద్ధికి ఇలాంటి అంతర్జాతీయ ప్రదర్శనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
"అరబ్ ఆభరణాల ప్రదర్శన ఈ ప్రాంతంలోని అత్యంత విశిష్టమైన ప్రత్యేక కార్యక్రమాలలో ఒకటి, ఇది సందర్శకులకు సృజనాత్మకతను లగ్జరీ టచ్ తో కలిపే గొప్ప అనుభవాన్ని అందిస్తుంది" అని టూరిజం మినిస్టర్ ఫాతిమా అన్నారు.
అరబ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో 29 దేశాల నుండి 659 మంది, అరబ్ పెర్ఫ్యూమ్ ఎగ్జిబిషన్లో 6 దేశాల నుండి 51 మంది ఎగ్జిబీటర్స్ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త







